తెలుగు దేశం పార్టీ అనుబంధ సాహితీ సంస్థ - తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో, రాష్ట్రంలోని జిల్లాల ప్రాశస్త్యాల గురించి పలు కవితా సంకలనాలు వేయడం జరుగుతోంది. దీంట్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ప్రాశస్త్యం గురించి, అక్కడి భాష,యాస , జానపద , సాంస్కృతిక వారసత్వ విశేషాలపై కవితలు పంపవలసిందిగా కోరుతున్నాం. కావున ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన కవులందరూ జులై 31వ తేదీలోగా myfrndmahi@gmail.com / telugurakshanavedika@gmail.com కి తమ ఫోటో తో పాటుగా కవితలని ఈమెయిల్ చేయగలరు. ఎంపిక చేయబడిన కవితలకి గాను ఆయా కవులకి జిల్లా కేంద్రంలో - ఆగస్ట్ లో జరిగే అభినందన సత్కారాల కార్యక్రమంలో సన్మానం చేయబడును.
వివరాలకు 9963427242 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.
- బొడ్డు మహేందర్
తెలుగు రక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి
No comments:
Post a Comment