Friday 2 December 2011

మాతృ భాష పై మమకారం చూపరా..

మన భాషే మనకు లోకువ అయితే 
ఆంగ్ల భాష యే లోకం అయితే 
మనదైన సంస్కృతి మనగలుగుతుందా ..?
మనసైన సాహిత్యం ఇక వెలువడుతుందా ..?

ఆత్మీయత పలుకులను వొదిలి ,
అరువు తెచ్చిన భావాలను చిలికితే 
అది గుండె లోతుల్ని తాకుతుందా ..?
మన నిండు భావనలను చెబుతుందా ..?

జాతి పిత " ఆత్మ కథ"ని రాసింది..
విశ్వకవి " గీతాంజలి "ని రాసింది ..
వారి మాతృ భాషలోనే కదా ..!!
చైనీయులు ఆధునికతకు మారినా.. 
జపనీయులు సాంకేతికంగా ఎదిగినా ..
వారి వారి భాషల్ని విడిచారా..?

మన భాషపై మక్కువతో 
"బ్రౌన్" నిఘంటు రచన చేసాడు 
కృష్ణదేవరాయలు "లెస్స" అని పలికాడు ..
విదేశీయులే కీర్తించిన గొప్ప భాష మనదిరా.. 
తెలుగు పలకడానికి నేడు నామోషీ యేలరా..

మాతృ దేశ అభిమానమే కాదు ..
మాతృ భాష పై మమకారం చూపరా..
తెలుగు భాషలో పలుకుతూ ..
మన ఆత్మ గౌరవాన్ని చాటారా...
***************************
written by ME,
at 8am, 12.2.2011
***************************
ఈ కవిత ఈనాడు పేపర్ ఆదిలాబాద్ జిల్లా ఎడిషన్ లో
ఫిబ్రవరి 22 ,2011 న ప్రచురితమైనది...

No comments:

Post a Comment