సమయం వేచి చూస్తోంది..
సమస్తాన్ని తుడిచి వేయాలని..
సంకల్పం పురిగొల్పుతోంది..
శాష్త్ర జ్ఞానాన్ని సద్వినియోగం చేయాలని..
మన అలక్ష్యమే పెను విపత్తుకి కారణం,
మన అత్యాశే ఈ ఘోరకలికి మూలం..
జ్యోతిష్యం చెప్పినా, కాలజ్ఞానం చెప్పినా
అది ఒక హెచ్చరిక మాత్రమే..
నీ నడకని, నడతని సరిచేసే ఒక సూచిక మాత్రమే..
యుగాంతం అన్నది జరిగినా, జరగకపోయినా
ప్రకృతి పట్ల నీ బాధ్యత మాత్రం మరువకు..
ప్రతి క్షణం జాగురూకతతో మెలగడం మానకు..
******************************
written by BODDU MAHENDER
at 9:02pm 20.12.2012
No comments:
Post a Comment