Friday 2 December 2011

సాయి నాథా ....

ఆదుకోమని అర్ధిస్తే అభయ  హస్తం అందిస్తావు ..
అభాగ్యులమని తలపోస్తే ..
అష్ట సిరులు  అనుగ్రహిస్తావు 
రూపులో ఫకీరు వయినా  
ప్రేమలో   అమీరు వయ్యా 
నీటితో దీపాలు వెలిగించావు ..
భిక్షతో పాపాలు  కడిగేసావు..
మా మనసులని శుద్ధి చేసి 
నీ భక్తి పాదు ను నాటావు 
మసీదు మందిరం   ఏదైనా
పాలించే ధైవమొక్కటే  అన్నావు 
మతాలు  కులాలు వేరైనా 
జాతి అంతా ఒక్కటని చాటావు..
సాయి నాథా  నీ  చరితం మధురం 
నిను కీర్తిస్తూ    చేసే 
మా ప్రతి  పనీ మధురం మధురం
********************************
written by ME,
at 9:50 am, 12.4.2010
********************************
ఈ  కవిత ఆంధ్రభూమి మాస పత్రిక  మార్చి 2011 సంచిక  లో ప్రచురించబడింది  ..    

    

No comments:

Post a Comment